కడప జిల్లా రాజంపేట పట్టణం మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు ఆకేపాటి ఫౌండేషన్ ట్రస్ట్, మీ నేస్తం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు రాజంపేట మాజీ శాసనసభ్యుడు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి పంపిణీ చేశారు. అకేపాటి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మునిసిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
వారికి ప్రత్యేక సంచులల్లో నిత్యావసర వస్తువులు ఉంచి అంద జేశారు. కరోనా కట్టడికి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి ని అకేపాటి అమర్ నాథ్ రెడ్డి అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ పోలా శ్రీను వాసులు రెడ్డి మీ నేస్తం అధ్యక్షుడు పెనుగలపాటి పెంచలయ్య నాయుడు, మున్సిపాలిటీ కమిషనర్ రాజశేఖర్ పాల్గొన్నారు.
ఇంకా మీ నేస్తం ప్రతినిధులు నవీన్, అవినాష్, గుప్తా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు,మురళి మోహన్ రెడ్డి,పసుపులేటి సుధాకర్,గురుప్రతాప్ రెడ్డి,హరినాథ్ చౌదరి,పాపినేని విశ్వనాథ్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,శేఖర్ రాజు,బాలకృష్ణ, జహీద్ అలీ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.