మంగళగిరి NRI కాలేజీని పక్కన ఉన్న 80 కోట్ల రూపాయల విలువగల దళితుని భూమిని దొంగచాటుగా అన్యాయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆక్రమించుకున్నారని సమతా సైనిక్ దళ్ ఆరోపించింది. సోము వీర్రాజు అక్రమాల మీద ఫిర్యాదు చేయడానికి విజయవాడ పుస్తక మహోత్సవానికి హాజరైన బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవడానికి దళిత సంఘాలు ప్రయత్నించాయి.
దళిత సంఘాలను కిషన్ రెడ్డిని కలవకుండా సోము వీర్రాజుతో పాటు దళితుల భూ ఆక్రమణలకు పాల్పడుతన్న బీజేపీ మీడియా కన్వీనర్ లక్ష్మీపతి రాజు అడ్డుపడ్డారని వారు ఆరోపించారు. కిషన్ రెడ్డిని కలవకుండా వెనుతిరిగే ప్రసక్తే లేదని దళిత సంఘాలు మొండికేశాయి. విజయవాడ పుస్తక ప్రదర్శన నుండి బీజేపీ నాయకులకు సమతా సైనిక్ దళ్ నిరసన వ్యక్తం చేసింది. సోము వీర్రాజు అక్రమాలపై ఫిబ్రవరి 18న బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం ముట్టడిని సమతా సైనిక్ దళ్ ప్రకటించింది.