సీఎం సాధికారత పథకంలో ఏజెన్సీ దళితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ మంగళవారం నాడు ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాల నుండి జీవిస్తున్న దళితులకు ఏజెన్సీలో హక్కులు లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు అందక ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి సీఎం సాధికారిక పథకం ప్రవేశపెట్టడం హర్షనీయమని, అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్నారు, ఏజెన్సీ దళితులకు ఎస్టీలతోపాటు సమాన హక్కులు ఇవ్వాలని, సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, భూమిలేని వారికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని పేర్కొన్నారు,
తమ పూర్వీకుల నుండి ఏజెన్సీ ప్రాంతంలో భూములను సాగు చేసుకుంటు జీవిస్తున్నామని కానీ ఇప్పటి వరకు పట్టాలు లేక రైతు బంధు రైతు భీమా వర్తించక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సీఎం సాధికారత పథకంలో ఏజెన్సీ దళితుల ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆదుకోవాలని కోరారు.