దసరా మహోత్సవాలు శ్రీశైలమహాక్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. నేడు కాత్యాయిని అలంకారం భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు.
దసరా మహోత్సవాలు పురస్కరించుకొని ఈ రోజు శ్రీ స్వామి అమ్మవారు హంస వాహనంపై కొలువు దీరారు. శ్రీశైల భ్రమరాంబ దేవి అమ్మవారి ఉత్సవమూర్తిని కాత్యాయిని దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పూజలో ఈవో కె.ఎస్.రామారావు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. పుష్పాలంకరణ శోభితులైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవమూర్తులను కనులారా దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు.
శ్రీశైల మహాక్షేత్రంలో ని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను స్వర్ణ హంపి ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గోవిందానంద సరస్వతి గురువారం దర్శించుకున్నారు.