నిన్న కృష్ణా నదిలో గల్లంతైన కృష్ణాజిల్లా యనమలకుదురు కు చెందిన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. కృష్ణానదిలోకి నలుగురు యువకులు ఈతకు వెళ్లిన విషయం తెలిసిందే. యనమలకుదురుకు చెందిన దాసరి రాజ్ కమల్ (16), విశ్వనాథపల్లి జీవన్ బాబు(15), చంద్ర రత్న రాకేష్ (16), జాన్ బనియన్(16) వీరిలో ఇద్దరు యువకులు రాత్రి గల్లంతైన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం తాడేపల్లి పోలీసులు కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టి చంద్ర రత్న రాకేష్, జాన్ బనియన్ ల మృతదేహాలను గుర్తించారు. మృతదేహాల్ని మంగళగిరి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
previous post