ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్గుప్తా దాఖలు చేసిన పిటిషన్ను సైతం సుప్రీం కోర్టు నేడు కొట్టివేసింది. ఇక పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొన్ని గంటల వ్యవధిలోనే తిరస్కరించారు. అలాగే డెత్వారెంట్పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు కూడా నిరాకరించింది. దీంతో నలుగురు దోషులను రేపు (మంగళవారం) ఉదయం ఆరుగంటలకు తీహార్ జైల్లో ఉరితీయనున్నారు. దీని కొరకు జైలు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.
previous post