38.2 C
Hyderabad
April 29, 2024 12: 28 PM
Slider ప్రత్యేకం

మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్టు

revanth arrest

నీటి వనరులను కాపాడే లక్ష్యంతో తీసుకువచ్చిన త్రిబుల్ వన్ (111) జీవోకు వ్యతిరేకంగా జన్వాడ లో మంత్రి కేటీఆర్ ఫామ్ ఫౌస్ నిర్మించారని కాంగ్రెస్ పార్టీ ఎంపి ఏ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ ను మీడియాకు వివరిస్తుండగా వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

దాంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 111 జీవోను తుంగలో తొక్కి అక్రమంగా కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారని వారన్నారు. 25 ఎకరాలలో మంత్రి కేటీఆర్ నిబంధనలకు వ్యతిరేకంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని అదే మని ప్రశ్నిస్తున్న తమను పోలీసులను పంపి అరెస్టు చేయిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిబంధలను సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ అతిక్రమించారని రేవంత్ రెడ్డి అన్నారు. గండిపేట చేరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ ఫామ్ అక్రమంగా నిర్మించారు. విలాసవంతమైన ఫామ్ హౌస్ లో కేటీఆర్- సీఎం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను కేటీఆర్ పాటించడం లేదని రేవంత్ ఆరోపించారు.

Related posts

దేశానికి సాంకేతిక విప్లవం అందించిన ఘనత రాజీవ్ గాంధీదే

Satyam NEWS

నాలుగు నెల‌లో రామతీర్ధం ఆల‌య నిర్మాణం పూర్తి చేసాం

Satyam NEWS

ఖరీఫ్ సాగుకు సన్నద్ధం చేయడంలో ప్రభుత్వం విఫలం

Bhavani

Leave a Comment