మరణభయం తో వణికిపోతున్నారు నిర్భయ దోషులు .తమపై డెత్ వారెంట్ జారీ కావడం, క్యూరేటివ్ పిటిషన్ ను కొట్టివేయడం, 22న ఉరి తీతకు ఏర్పాట్లు జరుగుతూ ఉండగా జిల్లలో ఉన్న నలుగురు నిందితులు పిచ్చి పట్టినట్టు అదోలా ప్రవర్తిస్తూ, ఏంటేంటో చేస్తున్నారు.అయినా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి వారి ప్రవర్తను గమనిస్తున్నామని జైలు వర్గాలు వెల్లడించాయి.
ముఖ్యంగా నలుగురిలో అత్యంత చిన్నవాడైన వినయ్ శర్మ ఎంతో ఆందోళనతో ఉన్నాడని, తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ, చాలా భయంతో ఉంటున్నాడని జైలు అధికారి ఒకరు తెలిపారు. వీరికి ఇప్పటికే ఆహారాన్ని తగ్గించామని, దాన్ని కూడా తినడం మానేశాడని అన్నారు. గత ఐదారు రోజులుగా వీరంతా సరిగ్గా నిద్రకూడా పోవడం లేదని వెల్లడించారు. శిక్షను అమలు చేసే సమయంలో వీరి మానసిక స్థితి సక్రమంగా ఉండాల్సివుందని, అందుకోసం వారితో రోజూ మాట్లాడి వారి మానసిక పరిస్థితిని అధ్యయనం చ్స్స్తున్నట్లు వారు తెలిపారు.
ఇక మంగళవారం నాడు వినయ్ శర్మను అతని తండ్రి కలిశాడు. ముఖేశ్ శర్మను అతని తల్లి కలిసింది. ఇక పవన్ కుమార్ తల్లిదండ్రులు ఈ నెల 7న వచ్చి వెళ్లారని, అక్షయ్ కుమార్ భార్య, గత సంవత్సరం నవంబర్ లో చివరిసారిగా వచ్చినట్టు జైలు వర్గాలు తెలిపాయి. ఉరి శిక్ష తేదీని ప్రకటించిన తరువాత దోషుల బంధువులు వారిని దూరం పెట్టారని, ఒకరిద్దరు మినహా వారితో ములాఖత్ కు ఎవరూ రాలేదని వెల్లడించాయి.
చివరిసారిగా కుటుంబ సభ్యులను కలవాలని అనుకుంటే వారిని పిలిపిస్తామని నలుగురికీ స్పష్టం చేసినప్పటికీ, వారి నుంచి సమాధానం రాలేదని తెలుస్తోంది. దోషులు స్పందించకుంటే, తుదిసారిగా కుటుంబీకులను కలిసే తేదీని తామే నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు.