అయోధ్యలో శ్రీరామ దివ్య మందిరం నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్నందుకు సంఘీభావంగా విజయవాడ సత్యనారాయణపురం లోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో దీపావళి పండుగ నిర్వహించారు. ఉదయం మర్యాద పురుషోత్తముడు శ్రీరాముని పూజా కార్యక్రమం నిర్వహించారు.
సాయంత్రం స్వామివారికి ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించి అనంతరం బాణాసంచా కాల్చి దీపావళి జరిపారు. విశ్వహిందూ పరిషత్ సుదీర్ఘ పోరాటాలతో, ఎందరో యోధుల బలిదానాలతో విజయం సాధించినట్లు ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా VHP కేంద్రీయ ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యుడు గోకరాజు గంగరాజు విచ్చేశారు. ఈ రోజు భారతీయులు విజయం సాధించిన పండుగ రోజుగా అయోధ్య దీపావళి జరుపుకోవాలని అలాగే శ్రీరామ మందిరం త్వరగా పూర్తి అవ్వాలని ప్రతీ రోజు ” శ్రీరామ జయరామ జయ జయ రామ ” అనే మహామంత్రాన్ని ప్రజలందరూ తమ ఇళ్ళలో జపించాలని విశ్వహిందూ పరిషత్ తరపున పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో VHP విజయవాడ మహానగర్ అధ్యక్షులు సాన శ్రీనివాస్ , కార్యదర్శి P.రాఘవరాజు , Pro. N.శివాజీ , చల్లా లక్ష్మీనారాయణ జీ కార్యకర్తలు పాల్గొన్నారు.