మరణించిన బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ స్నేహితుడు సందీప్ కుమార్ సింగ్ రిపబ్లిక్ టివిపై రూ.200 కోట్ల మేరకు పరువునష్టం దావా వేశారు.
రిపబ్లిక్ టివిలో తనపై దుష్ర్పచారం చేశారని, తన ప్రతిష్టకు భంగం కలిగించే వార్తలను పదే పదే ప్రసారం చేశారని ఆయన అన్నారు.
రిపబ్లిక్ టివి అధినేత అర్నబ్ గోస్వామి తనకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని ఆయన జారీ చేసిన లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
తనపై తన పరువుకు నష్టం కలిగించే విధంగా రిబపబ్లిక్ టివిలో ప్రసారం చేసిన అన్ని వార్తలను, సామాజిక మాధ్యమాలలో డిలీట్ చేయాలని ఆయన కోరారు.