31.7 C
Hyderabad
May 2, 2024 08: 48 AM
Slider ప్రత్యేకం

అమ్ముడు పోయిన ఎమ్మెల్యే లు వెంటనే రాజీనామా చెయ్యాలి

#Seetakka

కాంగ్రెస్ పార్టీ భీ ఫాం తో గెలిచి టి.ఆర్.ఎస్ పార్టీ కి అమ్ముడు పోయిన ఎమ్మెల్యే లు వెంటనే రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ చెమటను ధార పోసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ బి ఫాం తో గెలిచి అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి వారి చిత్త శుద్ది ఎంటో నిరూపించుకోవాలని ఆమె కోరారు.

అమ్ముడు పోయిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వెయ్యనప్పుడు ఈ అనర్హత చట్టాలు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. ‘‘మీరు అమ్ముడు పోయింది కాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా  సోనియా గాంధీ రేవంత్ రెడ్డి కి పదవి ఇస్తే ఓటు కు నోటు అని కారు కూతలు కూస్తారా?’’ అంటూ ఆమె ప్రశ్నించారు.

అన్నం అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీ ని నిస్సిగ్గుగా విమర్శలు చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. తప్పుడు కూతలు కూసే టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే లు పద్దతి మార్చుకోండి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Related posts

దేవాదాయ మంత్రిని, దుర్గగుడి ఈవోను తొలగించాలి

Satyam NEWS

శత చిత్ర దార్శనికుడికి నివాళులు

Satyam NEWS

చీఫ్ జస్టిస్ గా ఎన్ వి రమణ పేరు సిఫార్సు

Satyam NEWS

Leave a Comment