33.7 C
Hyderabad
April 29, 2024 01: 10 AM
Slider కృష్ణ

విజయవాడలో డిగ్రీ విద్యార్థుల క్రికెట్ టోర్నీ

సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ జయంతి వేడుకలు సందర్భంగా సిటీకేబుల్ ఆధ్వర్యంలో విజయవాడ డిగ్రీ కళాశాలలు విద్యార్థులకు క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నారు.

ప్రజాశక్తి నగర్ సిటికేబుల్ ప్రధాన కార్యాలయం నందు సిటికేబుల్ ఎండి పొట్లూరి సాయిబాబు నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా సమక్షంలో టోర్నమెంట్ జెర్సీలను అవిష్కరించి ఎనిమిది జట్ల కెప్టెన్ ల సమక్షంలో డ్రా తీశారు.

అనంతరం పొట్లూరి సాయిబాబు సిటీ కేబుల్ ఎండి మాట్లాడుతూ పొట్లూరి రామకృష్ణ జయంతి సందర్భంగా ప్రతియేటా క్రీడా పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా డిగ్రీ కళాశాల విద్యార్థులు కు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు.

9,10,11 తేదీలలో లయోలా కళాశాల క్రీడా మైదానంలో టోర్నమెంట్ అట్టహసంగా నిర్వహిస్తున్నాము. చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో విద్యార్ధులకు క్రికెట్ పోటిలు నిర్వహిస్తున్నాము. వారిలో ప్రతీభను వెలికితీసేందకు మా తొలి ప్రయత్నంగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలు‌ నిర్వహిస్తున్నాము అని ఆయన అన్నారు.

క్రికెట్ టోర్నమెంట్ పోటిలను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే టోర్నిమెంట్ కు మంత్రులు , ఎమ్మెల్యేలు, ఐఏఎస్ , ఐపిఎస్ అధికారలు పలువు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానున్నారు.

ఆదివారం మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. పొట్లూరి రామకృష్ణ జయంతి సందర్భంగా జనవరి 28న బహుమతి ప్రదానం ఉంటుంది.

Related posts

మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన సెట్విన్

Satyam NEWS

ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి నాని

Satyam NEWS

Leave a Comment