ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ సర్వే లు నిజమయ్యాయి.ఆప్ పార్టీ అధికారం లోకి వస్తుందని కేజ్రీవాల్ తెరిగి సీఎం కాబోతున్నాడని వారు చెప్పినట్టుగానే నేడు వెలువడుతున్న ఫలితాలు రుజువు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 67 స్థానాలను గెలుచుకున్న కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కు ఈ దఫా కొన్ని సీట్లు తగ్గుతాయని ఫలితాల ట్రెండ్స్ ను పరిశీలిస్తే తెలుస్తోంది. మొత్తం 70 స్థానాల్లో ట్రెండ్స్ వెలువడగా, 52 చోట్ల ఆప్, 17 చోట్ల బీజేపీ, ఒక స్థానంలో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు.
కాంగ్రెస్ ఒక్క చోట కూడా ప్రభావం చూపలేకపోయింది. ఢిల్లీ వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటుండగా, ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పవుతాయని తామే ఎన్నికల్లో గెలుస్తామని బీరాలు పోయిన బీజేపీ నేతలెవరూ ఇంకా మీడియా ముందుకు రాలేదు. మొత్తానికి మూడవసారి ఢిల్లీ పీఠంపై కేజ్రీవాల్ సీఎంగా కూర్చుంటారని ఆప్ వర్గాలు తెలుపుతూ తమని గెలిపించిన ఢిల్లీ ప్రజలకి కృతఙ్ఞతలు తెలియజేశారు.