సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జయ డెంటల్ వైద్యశాలను నియోజకవర్గ ఎంఎల్ఏ శానంపూడి సైదిరెడ్డి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రొత్తగా ఏర్పడిన నేరేడుచెర్ల మున్సిపాలిటీ ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నదని, ప్రభుత్వ పరంగా ప్రత్యేక శ్రద్ద వహించి శరవేగంగా అభివృద్ధే చెందే విధంగా కృషి చేస్తానని అన్నారు.
వైద్యశాల యాజమాన్యం ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి, మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చందమల్ల జయబాబు, వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి, DCCB డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, చంద్రయ్య గౌడ్, ఇంజమూరి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.