హైదరాబాద్ లోని అత్యంత కీలక ప్రాంతమైన మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ రేపు రూ.89.20 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. ప్రభుత్వ విప్, శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, GHMC అధికారులతో కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
గోకుల్ ప్లాట్స్ లో ప్లాట్ నంబర్ 56 నుండి 66 వరకు, రోడ్డు నంబర్ 23 వద్ద రూ.20.00 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు రేపు ప్రారంభిస్తారు. ఆదిత్య నగర్ సైబర్ వ్యాలి నుండి రోడ్డు నంబర్ 14 వరకు రూ.20 లక్షలతో యూజిడి పైప్ లైన్ నిర్మాణ పనులు, ఇజ్జాత్ నగర్ లో రూ.15.20 లక్షలతో యూజీడీ పైప్ లైన్ పునరుద్ధరణ నిర్మాణ పనులు, చందా నాయక్ తండ దోభి ఘాట్ వద్ద రూ.14 లక్షలతో యూజీడీ పైప్ లైన్ పునరుద్దరణ నిర్మాణ పనులు రేపు ప్రారంభిస్తారు. సాయి నగర్ తండ ఇంటి నంబర్ 1-98/B నుండి ఇంటి నంబర్ 1-98/69/A/1 వరకు రూ.20.00 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మాదాపూర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బూత్ మెంబర్లు, కాలనీ వాసులు, అసోసియేషన్ సభ్యులు అందరు పాల్గొనాలని కోరారు.