సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శుఖుస్థాపన చేశారు. చౌటపల్లి గ్రామంలో DMFT నిధుల ద్వారా మంజూరైన నిధులతో చౌటపల్లి, అల్లీపురం గ్రామాల మధ్య 15 లక్షల రూపాయల విలువైన BT రోడ్డుకు స్థానిక శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మన్నెం శ్రీనివాస్ రెడ్డి, ZPTC జగన్ నాయక్, MPP కొండా నాయక్,TRS నాయకులు బ్రహ్మారెడ్డి, చౌటపల్లి, అల్లిపురం సర్పంచ్ లు స్థానిక నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.