31.7 C
Hyderabad
May 2, 2024 07: 05 AM
Slider ఆధ్యాత్మికం

9న శ్రీ‌వారి 4వ నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం

Tirumala_090615

శ్రీ‌వారి 4వ నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ ఆదివారం పౌర్ణమి గరుడసేవలో వైభవంగా జరుగనుంది. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా ద్రావిడ వేద నాలాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని దాదాపు 200 మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పారాయణదారులు విచ్చేయనున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకు తిరుమలలోని ఆస్థానమండపంలో నాలాయిర దివ్యప్రబంధ పారాయణదారులతో సమావేశం నిర్వహిస్తారు. టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి విచ్చేసి తమ సందేశాలిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు దివ్యప్రబంధ గోష్ఠిగానం నిర్వహిస్తారు.

ఆ త‌రువాత రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగనున్న శ్రీవారి పౌర్ణమి గరుడసేవలో జీయ‌ర్‌స్వాముల వెంట పండితులు దివ్యప్రబంధ పారాయణం చేస్తారు. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్ ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Related posts

ఈ తల్లి ఏడుపు వినిపిస్తున్నదా పాలకులారా?

Satyam NEWS

మెట్రో టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్

Satyam NEWS

ఇన్ హ్యూమన్:11 మందిని పాశవికంగా నరికేసిన ఐసిస్

Satyam NEWS

Leave a Comment