రాష్ట్ర మంత్రి కొడాలి నాని తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తాగిన మత్తులో వ్యాఖ్యలు చేయడం దారుణమైన విషయమని బిజెపి నేత విష్ణుకుమార్ రాజు అన్నారు.
కొడాలి నాని మాటలు హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అన్నారు. కొడాలి నాని మదమెక్కి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
కొడాలి నాని చర్చిలు మీద మస్లీంలు మీద మాట్లాడితే జగన్ కొడాలి నాని మంత్రి పదవి పీకేస్తారని అందుకోసం హిందులకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు.
జగన్ మెప్పు కోసం ప్రధాని మోది, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పై దారుణంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.