29.7 C
Hyderabad
May 2, 2024 06: 13 AM
Slider నిజామాబాద్

కేసీఆర్ వల్లే ముదిరాజులలో అసంతృప్తి

సీఎం కేసీఆర్ వల్లనే ముదిరాజులలో అసంతృప్తి నెలకొందని మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి అబ్రబోయిన స్వామి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరవీరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ అనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది ముదిరాజ్ లు చనిపోయారని గుర్తు చేశారు.

అలాంటి తమకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. కామారెడ్డి నియోజకవర్గంలో 50 వేలు, ఎల్లారెడ్డిలో 70 వేలు, జుక్కల్, బాన్సువాడ నియజకవర్గాల్లో 40 వేల చొప్పున ముదిరాజ్ లు ఉన్నారని, గెలుపోటములు శాసించే స్థాయిలో ఉన్న తమను పట్టించుకోని ఏ పార్టీ అయినా తాము బహిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 8 న కామారెడ్డిలో నిర్వహించే ముదిరాజ్ మేధావుల రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కాకర్ల శేఖర్, కిష్టయ్య, అశోక్, లింగం, దేవేందర్, ప్రభాకర్ పాల్గొన్నారు.

Related posts

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో జీవిత ఖైదు

Satyam NEWS

పోలీస్ అంటే ఆప‌ద్భాంధవుడు…! యూనీఫాం ధ‌రించే రిటైర్ అవ్వాలి

Satyam NEWS

తిరుపతి కరోనా టెస్టుల డేటా క్షేమంగా ఉందా?

Satyam NEWS

Leave a Comment