మిచౌంగ్ తుఫాన్ ముందస్తు సహాయక చర్యలలో భాగంగా సూర్యలంకలోని సముద్ర తీరాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా నేడు సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తో బాటు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ఉన్నారు. చీరాల, చినగంజాం, వేటపాలెం లో నేటి ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. తీరం వెంట పెరుగుతున్న అలల తాకిడితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చీరాల, చినగంజాం, వేటపాలెం లో భారీ వర్షం కురుస్తున్నది.
next post