వేసవి కాలంలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహద పడతాయనీ ఉప్పల్ ఎమ్మేల్యే బెతి సుభాష్ రెడ్డి,కార్పొరేటర్ శాంతి సాయి జెంట్స్ శేఖర్ తెలిపారు. బుధవారం నాచారం డివిజన్ లోని హెచ్ఎంటి బస్టాండ్ సమీపంలో నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ అత్తమామలు కీర్తిశేషులు చిట్టిపోలు నారాయణ, శంకరమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతీ సుభాష్ రెడ్డి హాజరై ప్రారంభించారు.
నిర్వాహకులు సాయి జన శేఖర్ మాట్లాడుతూ కీర్తిశేషులైన తన తల్లిదండ్రుల పేరు పైన పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ద్వారా వేసవి కాలంలో చల్లని నీరు అందించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేయడమైనది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాయి జన శేఖర్ కాటేపల్లి రవీందర్ రెడ్డి కట్ట బుచ్చన్న గౌడ్ శ్రీరామ్ సత్యనారాయణ, విఠల్ యాదవ్, దాసరి కర్ణ , గౌడవెల్లి రామకృష్ణ, దేవులపల్లి యాదగిరి, టేకులపల్లి రామ్ చందర్ ,ఏం డి రఫిక్ ఎర్పూల రాజు, మహిళలు ప్రీతి రెడ్డి, సుగుణ ,షాహిన్ బేగం, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి