35.2 C
Hyderabad
May 1, 2024 02: 06 AM
Slider గుంటూరు

టీడీపీ నేత పై కాల్పులకు జిల్లా ఎస్ పిదే బాధ్యత

#Dhulipalla Narendra Kumar

పల్నాడును ప్యాక్షన్ రాజకీయాలకు అడ్డాగా వైసిపి ప్రభుత్వం మారుస్తున్నదని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. ఇంట్లో నిద్రపోతున్న టిడిపి నాయకుడు బాల కోటి రెడ్డిని బయటకు లాగి కాల్పులు జరిపిన వైసిపి గుండాలను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో బాల కోటి రెడ్డి మీద కత్తుల దాడి జరిగిన ఘటన మీద ఇప్పటికీ చర్యలు లేవు. పల్నాడు లో జరిగిన ప్రతి ఘటన వెనుక జిల్లా ఎస్పీ అండదండలు ఉన్నాయి. బాల కోటి రెడ్డి మీద జరిగిన కాల్పులకు జిల్లా ఎస్పీ భాధ్యత వహించాలి.

బాల కోటి రెడ్డి కత్తుల దాడి మీద చర్యలు తీసుకుంటే నేడు ఇంతటి దారుణానికి తెగబడే అవకాశం ఉండేది కాదు అని ఆయన అన్నారు. పల్నాడు ఘటనలకు హోం శాఖ నిద్రమత్తు వల్లే జిల్లా ఎస్పీ కనుసన్నల్లో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

Related posts

తెలంగాణ రాష్ట్రం లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Bhavani

పూనే రైల్వేస్టేషనులో దొరికిన హ్యాండ్ గ్రెనెడ్

Satyam NEWS

కోదాడ పట్టణంలో పట్టుబడ్డ చైన్ స్నాచింగ్  దొంగలు

Satyam NEWS

Leave a Comment