పల్నాడును ప్యాక్షన్ రాజకీయాలకు అడ్డాగా వైసిపి ప్రభుత్వం మారుస్తున్నదని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. ఇంట్లో నిద్రపోతున్న టిడిపి నాయకుడు బాల కోటి రెడ్డిని బయటకు లాగి కాల్పులు జరిపిన వైసిపి గుండాలను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గతంలో బాల కోటి రెడ్డి మీద కత్తుల దాడి జరిగిన ఘటన మీద ఇప్పటికీ చర్యలు లేవు. పల్నాడు లో జరిగిన ప్రతి ఘటన వెనుక జిల్లా ఎస్పీ అండదండలు ఉన్నాయి. బాల కోటి రెడ్డి మీద జరిగిన కాల్పులకు జిల్లా ఎస్పీ భాధ్యత వహించాలి.
బాల కోటి రెడ్డి కత్తుల దాడి మీద చర్యలు తీసుకుంటే నేడు ఇంతటి దారుణానికి తెగబడే అవకాశం ఉండేది కాదు అని ఆయన అన్నారు. పల్నాడు ఘటనలకు హోం శాఖ నిద్రమత్తు వల్లే జిల్లా ఎస్పీ కనుసన్నల్లో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.