29.7 C
Hyderabad
April 29, 2024 07: 35 AM
Slider విజయనగరం

కార్యాలయ పర్యవేక్షకులు గోపీనాథ్ సేవలు శ్లాఘనీయం…!

#VijayanagaramPolice

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆఫీసు సూపరింటెండెంట్ గా పని చేసి, ఇటీవలే బదిలీ పై రేంజ్పో లీసు కార్యాలయంకు వెళ్ళిన చీపురుపల్లి గోపీనాధ్ సేవలు శ్లాఘనీయమని జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం బి – సెక్షను పర్యవేక్షకునిగా గోపీనాథ్ పోలీసుశాఖలో సమర్ధవంతంగా పని చేసి,జిల్లా పోలీసుశాఖకు విశిష్టమైన సేవలందించారన్నారు.

ట్రెజరీకి బిల్లులను సకాలంలో పూర్తి చేసి పంపడం, వాటిని మంజూరయ్యే విధంగా నిరంతరం పర్యవేక్షించేవారన్నారు. గోపీనాధ్ సమర్ధతతను, సేవలను గుర్తించి విశాఖపట్నం రేంజ్ కార్యాలయంలో ఇన్స్ స్పెక్షన్స్ స్టోర్ సూపరింటెండెంట్ గా ఉన్నతాధికారులు బదిలీ చేయడమైనదన్నారు.

రేంజ్ కార్యాలయంలో కూడా సమర్ధవంతంగా పని చేసి, మరింత గుర్తింపు పొందాలని జిల్లా ఎస్పీ రాజకుమారి ఆకాంక్షించారు. అనంతరం, గోపీనాధ్ ను జ్ఞాపిక, మెమెంటోతో సత్కరించి, ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఏఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, డీసీఆర్ బి సీఐ బి.వెంకటరావు, డీటీసీ సీఐ రాజశేఖర్, ఎస్బీ ససీఐలు ఎన్.శ్రీనివాసరావు, జి.రాంబాబు, ఆర్ ఐ లు చిరంజీవీవరావు, నాగేశ్వరరావు, టివిఆర్ కే కుమార్, ఈశ్వరరావు, రాజు, రమణమూర్తి ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ప్రొటెస్టు: 24వ రోజుకు చేరిన ఎన్ఆర్ సి నిరసనలు

Satyam NEWS

లెజెండ్ ను కోల్పోయిన సినీ పరిశ్రమ

Murali Krishna

రాజీమార్గం… రాజమార్గం:న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయవాదులు

Satyam NEWS

Leave a Comment