పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కడప జిల్లా రాజంపేట పట్టణంలో మైనారిటీల రిలే నిరాహార దీక్ష 24 వ రోజుకు చేరింది. ఆర్.అండ్.బి.బంగాళా వద్ద జరుగుతున్న ఈ నిరసన శిబిరం వద్దకు వివిధ రాజకీయ, స్వచ్చంద సంస్థలు,కుల సంఘాల ప్రతినిధులు తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సమావేశంలో సి.ఏ.ఏ, యనార్సీ బిల్లును వెంటనే ఉపసంహరించు కోవాలని వారు తీర్మానం చేసి,కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రిలే దీక్షలకు వైసీపీ మైనారిటీ నేత గుల్జార్ ఆధ్వర్యం వహించారు.
previous post