టిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కొమురం బీమ్ జిల్లా బిజెపి అధ్యక్షుడు జెబి పౌడేల్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన అన్నారు నేడు కాగజ్ నగర్ పట్టణ బిజెపి అధ్యక్షులు గోలెం వెంకటేశం ఆధ్వర్యంలో జెబి పౌడేల్, కాగజనగర్ MRO కు ఈ మేరకు మెమోరాండం అందించారు.
TRS మంత్రులు, MLA లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, జిల్లా కార్యదర్శులు దిలీప్, నాగమణి,
జిల్లా మోర్చా నాయకులు ముత్తు అశోక్, మందాడే సుధాకర్, అరుణ్ డోంగిరి, జిల్లా నాయకులు పట్టణ కమిటీ ఉపాధ్యక్షులు చెరాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు గుమ్ముల సాయి కృష్ణ, మాచర్ల శ్రీనివాస్, మోర్చా అధ్యక్షులు పిశాన్న చీప్ప మౌనిక, చెప్ప రమేష్, రంజతన్ సింగ్, మంచిల్ల మల్లేష్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.