తెలంగాణ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి ములుగులో పాలాభిషేకం నిర్వహించారు. ఈరోజు ములుగు అంబేడ్కర్ జంక్షన్లో జరిగిన ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ జగదీష్ అధ్యక్షత వహించారు.
తెలంగాణ దళిత జన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు స్కైలాబ్ కూన ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు బొచ్చు సమ్మయ్య పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోయిని సదయ్య , మోడం శివ శంకర్ , జెరిపోతుల పైడి, ములుగు పట్టణ అధ్యక్షుడు మెరుగు సంతోష్, గోవిందరావుపేట మండల అధ్యక్షుడు మురారి బిక్షపతి , నర్సాపూర్ వార్డ్ నెంబర్ జూకంటి శంకరమ్మ , గ్రామ కమిటీ అధ్యక్షుడు బంక బాబురావు, రోంటాల రాజయ్య, నక్క రాజు ,బొల్లం ప్రసాద్ ,భానోతు వెంకన్న, రుద్ర బోయిన మల్లేష్, పేర బోయిన రమేష్, వేల్పుల రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.