38.2 C
Hyderabad
April 29, 2024 19: 08 PM
Slider నల్గొండ

శాసనసభ్యుడు సైదిరెడ్డికి వినతిపత్రం అందజేసిన ప్రెస్ క్లబ్ సభ్యులు

#press club

జర్నలిస్టుల సమస్యలను  వెంటనే పరిష్కరించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దాచేపల్లి దయాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నక్క నరేష్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని  ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం సోమవారం సమావేశం జరిగింది. 

యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా నాగేశ్వరరావు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో అద్యక్ష్య, కార్యదర్శి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డులు,హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.

కరోనతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు,డబుల్ బెడ్ రూమ్ గృహాలు మంజూరు చేయాలని అన్నారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  చొరవ తీసుకొని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకుని వెళ్ళాలని అన్నారు.అనంతరం శాసనసభ్యుడు సైదిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. 

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్  గౌరవ అధ్యక్షుడు టి.వి.ఎల్, ఉపాధ్యక్షుడు పిల్లలమర్రి శ్రీనివాసు,వర్కింగ్ ప్రెసిడెంట్ దేనంకొండ  శేషంరాజు, కార్యదర్శి కితా రామనాథం,సహాయ కార్యదర్శి దేవరం వెంకటరెడ్డి, కోశాధికారి చిట్టి పొతుల రమేష్,గౌరవ సలహాదారులు దేవరం రాంరెడ్డి, సోమగాని రాంప్రసాద్,ఇందిరాల వెంకట్రామ్,ఇటిమల్ల రామకృష్ణ, విష్ణుదాస్యం ఉమశంకర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

గుడ్ న్యూస్: 400 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం

Satyam NEWS

ఆటో కరెంటు స్తంభానికి ఢీకొని మహిళ మృతి

Satyam NEWS

రుణమాఫీ చేసినందుకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS

Leave a Comment