సంగం డైరీ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఇప్పుడు కరోనా భయం పట్టుకున్నది.
సంగం డైరీ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికి ముగ్గురిని అరెస్టు చేశారు.
అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన వారిలో సంగం డైరీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డైరీ ఎండీ గోపాల కృష్ణ, ప్రకాశం జిల్లా సమన్వయకర్త గుర్నాథం ఉన్నారు.
వీరిని కోర్టు లో హాజరు పరిచారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించగా మూడవ నిందితుడు గుర్నాధం కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దాంతో ఉదయం నుంచి గుర్నాథంతో ఉన్న ఏసీబీ అధికారుల్లో ఆందోళన మొదలైంది. గుర్నాథం నుం కోర్టులో హాజరు పర్చకుండా ప్రభుత్వాస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు.