పేద విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు సరైన వసతులు లేక చదువుకు దూరమై ప్రమాదం ఏర్పడిందని టీజీవీపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించబడుతున్న నర్సాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్లో విద్యార్థులకు వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వస్తున్నారు అని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమై ప్రమాదం ఏర్పడింది అన్నారు. విద్యార్థులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల టీజీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
previous post
next post