30.7 C
Hyderabad
April 29, 2024 06: 50 AM
Slider ముఖ్యంశాలు

అడ్డుకోవాల్సినవారే అంటగట్టారు

#agriculture department,

కంచే చేను మేసిన చందాగా నకిలీ విత్తనాలను అరికట్టాల్సిన వ్యవసాయ శాఖ రైతులకు నకిలీ విత్తనాలను విక్రయించింది. వాటిని తీసుకున్న రైతులు లబోదిబోమంటున్నారు. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి సొసైటీ గోదాములకు నకిలీ విత్తనాలు సరఫరా కావడం చర్చనీయాంశం అయింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర

విత్తనాభివృద్ధి సంస్థకు నకిలీ మకిలీ అంటింది. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని వ్యవసాయ అధికారులు నిత్యం హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కాని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోనే సబ్సిడీపై రైతులకు వైరాలో నకిలీ విత్తనాలు పంపిణీ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది

ఉత్సవాల్లో భాగంగా ఈనెల మూడో తేదీన వైరాలో జరిగిన రైతు దినోత్సవం సభలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆర్భాటంగా రైతులకు జీలుగు విత్తనాల కుపన్లు పంపిణీ చేశారు. అనంతరం ఈనెల5న తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి వచ్చిన జీలుగు విత్తనాలను రైతులకు అందజేశారు. వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన

72మంది రైతులకు 310 జీలుగు బ్యాగులను అధికారులు పంపిణీ చేశారు. ప్రభుత్వ సబ్సిడీ బోను 30కేజీల జీలుగు బ్యాగుకు రూ.842.70 పైసలను రైతులు చెల్లించారు. అయితే రైతులు ఇంటికి తీసుకువెళ్లిన విత్తనాలను పరిశీలించగా నకిలీవిగా తేలాయి. ఈ విత్తనాలు పలు రంగుల్లో ఉండటం విశేషం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంస్థ పేరును

ముద్రించిన బ్యాగులో ప్రభుత్వ నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించడం ప్రస్తుతం విమర్శలు తయారుచేస్తుంది. తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ నుంచి వైరా సొసైటీ కి సోమవారం మొత్తం 830జీలుగు బస్తాలు వచ్చాయి.

ఈ విత్తనాలను కొనుగోలు చేసిన సోమవరం రైతులు నకిలీ విత్తనాలుగా అనుమానించారు. పలు రకాల రంగుల్లో ఈ విత్తనాలు ఉండటంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం తీసుకువచ్చి సొసైటీ గోదాంలో రిటర్న్ చేశారు. ప్రభుత్వం ద్వారా తమకు నకిలీ విత్తనాలు ఎందుకు విక్రయించారని రైతులు ఆందోళనకు దిగారు. దీంతో సొసైటీ అధికారులు

రైతులకు మరోసారి కూపన్లు రాసి తాటిపూడి సెంటర్లో విత్తనాలు కేటాయించారు. ఈవిషయమై వైరా మండల వ్యవసాయ అధికారి రామోజి పవన్ కుమార్‌ను వివరణ కోరగా.. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పరీక్షించిన

తర్వాతనే విత్తనాలు సొసైటీలకు వస్తాయని చెప్పారు. రెండు లాట్ నెంబర్లలో వైరా గోదాంకు వచ్చిన జీలుగు విత్తనాల రంగులో తేడా ఉందని అంగీకరించారు. తేడాగా ఉన్న విత్తనాలను రైతులు నుంచి రిటర్న్ తీసుకొని తాటిపూడి సెంటర్లో

మరలా వారికి విత్తనాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు పలు రంగుల్లో ఉన్న విత్తనాల బస్తాలను తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు రిటర్న్ చేస్తున్నామని వివరణ ఇచ్చారు.

Related posts

నూతన సంసద్ భవనం దేనికి సంకేతం?

Sub Editor

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు “స్పందన”

Satyam NEWS

సోము వీర్రాజు అభిమాని ఆత్మహత్యాయత్నంతో అలజడి

Satyam NEWS

Leave a Comment