పండుగ పేరుతో తల్లిలాంటి ఆవుల కోతలు ఆపాలని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో హిందు వాహిని డిమాండ్ చేసింది. హిందు వాహిని ఆధ్వర్యంలో నేడు కల్వకుర్తి ఠాణాలో ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా హిందూ వాహిని మండల అధ్యక్షుడు దేవర్ల అంజి మాట్లాడుతూ మన సనాతన ధర్మానికి పునాది గోవులు అన్నారు. తల్లి కంటే గోవు గొప్పదని , ఇందులో పవిత్రంగా పూజించే గోవులను కొందరు పండుగ పేరుతో కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గోవులను చంపకుండా పోలీసువారు బాధ్యత వహించి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ కేసు నమోదు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.