చలి తీవ్రతకు ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు సహాయం చేయాలని ముందు వచ్చిన యూనైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, పీపుల్ హెల్పింగ్ చిల్ర్డన్ స్వచ్చంద సంస్థవారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు ఆమె 200 మందికి పైగా నిరుపేద వృద్ధులకు దుప్పట్లను పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, ఎంపిటీసీ మావురపు తిరుపతి రెడ్డి, దేవేందర్, శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ భధ్రయ్య, వార్డు మెంబర్లు దేవ్ సింగ్, బొల్లెం రవి, శ్రీధర్, గోవర్ధన్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.