ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పోలీసులు సమర్థవంతంగా సేవలు అందించాలని ములుగు ఎస్ పి డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ అన్నారు.
ప్రజలు ఏ సహాయం కావాలన్నా పోలీసుల వద్దకే వస్తారని దాన్ని దృష్టిలో ఉంచుకుని పని చేయాలని ఆయన అన్నారు.
పేరూరు సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న పోగుల శ్రీకాంత్ నేడు ఎస్ పిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు.
ఈ సందర్భంగా ఎస్ పి ఆయనకు అభినందనలు తెలిపి విధి నిర్వహణలో చురుకుగా ఉండాలని సూచించారు.