తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సీనియర్ అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రశాంత్ రూ.7 లక్షల విలువైన 50 సైకిళ్ళు విరాళంగా అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాత సైకిళ్లను టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమం లో టీటీడీ బోర్డు సభ్యులు సౌరబ్, సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి, బాల్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు ప్రభాకర్ బాబు, భారతి, అభిషేక్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
previous post
next post