డోర్నకల్ ఖమ్మం మిర్యాలగూడ మధ్య నూతన రైల్వే ప్రాజెక్ట్ కు కేంద్రం పచ్చ జెండా ఊపింది. సికింద్రాబాద్ విజయవాడ, సికింద్రాబాద్ రేపల్లె లైన్లను కలుపుతూ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 133 కిమీ లైన్ కు డిపిఆర్ సిద్దం చేశారు. రెండు జంక్షన్లు, 8 క్రాసింగులు తో పాటు నేలకొండపల్లి, కోదాడ, హుజూర్నగర్ లలో స్టేషన్ హాల్ట్ ఉండేట్లుగా రైల్వే ఇంజనీరింగ్ టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సిద్దం చేశారు. 1295 కోట్లతో పాపటపల్లి, గోళ్లపాడు, గుర్రాలపాడు, గువ్వలగూడెం, నేలకొండపల్లి, రామచంద్రాపురం, కోదాడ, హుజూర్ నగర్, ఎర్రగుట్ట, వరదాపురం మరియు జాన్ పహాడ్ లను కలుపుతూ రైల్వే లైన్ నిర్మించేందుకు కసరత్తు జరగుతుండగా మూడేళ్లలో దీనిని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
previous post