బాగ్ అంబర్పేట్ డివిజన్ గాంధీ బొమ్మ మెయిన్ రోడ్డు కట్టెల మండి దగ్గర డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్యతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డికి ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన కార్పొరేటర్ ఆ ప్రాంతానికి వెళ్ళి సమస్యను పరిశీలించి వాటర్ వర్క్స్ డిజీఎం విష్ణువర్ధన్ రావుతో, మేనేజర్ మజీద్ తో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఇక్కడి డ్రైనేజీ మరియు మంచినీటి పైప్ లైన్లు పాడైపోయిన వాటికి సంబంధించిన మరమత్తు పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి అధ్యక్షులు చక్క జగన్, మల్కిరెడ్డి మల్లారెడ్డి, సాయన్న, బాలకృష్ణ గౌడ్, మహేష్ గౌడ్ పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్