రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ విద్యార్థులకు పాఠశాల యూనిఫామ్ లు పంపిణీ చేశారు.రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 680 మంది విద్యార్థులకు బుధవారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ పాఠశాల యూనిఫామ్ లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1994 తను తలకొండపల్లి సర్పంచ్ గా ఎన్నికైన నాటి నుండి విద్యార్థులు దుస్తులు పంపిణీ చేస్తున్నానని పేర్కొన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం చాలామందికి ఆర్థిక సహాయం అందజేసినట్లు ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా పేద విద్యార్థులకు తమ వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మాణ శ్రీశైలం గౌడ్, స్థానిక సర్పంచ్ లలిత జోతయ్య, పెద్దలు కండే జగదీశ్వర్ గుప్తా గారు, సింగల్ విండో డైరెక్టర్ శేఖర్ యాదవ్, స్వరూప ,వార్డు మెంబర్లు విట్టల్, దశరథం, రవికుమార్, రమేష్, నూకం కోటేశ్వర్ ప్రధానోపాధ్యాయులు, మరియు టీచర్లు తదితరులు పాల్గొన్నారు.