వేసవి లో ప్రజలకు త్రాగునీరుకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా చూడాలని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం టీచర్స్ కాలనీలో మంచినీటి పైప్ లైన్ పగిలి త్రాగునీరు మురికిగా వస్తున్నాయని స్థానికులు చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కి దృష్టికి తీసుకు వచ్చారు.
మేరకు స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి సానుకూలంగా స్పందించి వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి కాలనీలలో విస్తృతంగా పర్యటించి సమస్యను పరిష్కరించారు. డివిజన్ లోని ప్రతి కాలనీలోని మెయిన్ వాటర్ కనెక్షన్ పాయింట్ లను క్షుణ్ణంగా పరిశీలించి, లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. వేసవి లో ప్రజలకు త్రాగునీరుకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా చూడాలని అధికారులకు సూచించారు.