ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ ను అభివృద్ధికి అద్దం పట్టె విదంగా తీర్చిదిద్దుతామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం మల్లాపూర్ డివిజన్ లోని బ్రహ్మపురి కాలనీ లో 2 కోట్ల వ్యయంతో బాక్స్ డ్రైన్ పనులను శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి , ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డిలు హాజరై భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ ను అభివృద్ధికి అద్దం పట్టె విదంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సమస్యల పరిష్కారం, త్వరగతిన పనుల పూర్తికి కృషి చేస్తామని మేయర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ZC పంకజ, SC అశోక్ రెడ్డి, DC శంకర్, AMOH శ్రీనివాస్, DE రూప, AE శ్రవంతి, బ్రహ్మపురి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు శైలేష్ రెడ్డి, విశ్వరూప చారీ, బేతాళ మల్లేష్, శంకర్, నర్సింహా రెడ్డి, నారాయణ, ఉపేందర్, మోహన్, తిరుపతి, సురేష్ పాస్టర్, రహీం, వెంకట్, శోభ, కృష్ణ, రవి, శ్రీను, స్థానిక తెరాస నాయకులు పల్లా కిరణ్ కుమార్, హమాలీ శ్రీనివాస్, శీతల విజయ్, ప్రభాకర్ రెడ్డి, పద్మా రెడ్డి, మారుతీ రావు, ఎల్లేష్, PR ప్రవీణ్, జబ్బార్, విజయభాస్కర్, రాపోలు శ్రీనివాస్, శ్రీకాంత్, జయరాజ్, కోటేశ్వరి, తులసి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి