33.7 C
Hyderabad
April 29, 2024 23: 31 PM
Slider గుంటూరు

తాగుబోతు కొడుకు తల్లినే నరికేశాడు

#Son killed Mother

తాగడానికి డబ్బులు ఇవ్వడంలేదని కన్నతల్లినే చంపేశాడో కసాయి కొడుకు. గుంటూరు జిల్లా తెనాలిలో ఈ దారుణ సంఘటన జరిగింది. తెనాలి లోని గంగానమ్మ పేటలో నివసించే 65 ఏళ్ల వృద్ధురాలు శశిదేవి కొడుకు చేతిలో హతం కావడం ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది.

శశీదేవి కుమారుడు ముమ్మనేని లక్ష్మీనారాయణ (40) తాగుడుకు బానిసగా మారాడు. తాను తాగేందుకు తన తల్లి డబ్బులు ఇవ్వడం లేదని కోపంతో నేటి రాత్రి 7.30కి అక్కడే ఉన్న పనస కాయలు కోసే కత్తితో మెడను తెగ నరికి ఇంట్లో నుంచి పరారయ్యాడు.

ఆమెను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా ఆ తల్లి మార్గమధ్యంలోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Related posts

ఫిర్యాదులు లేని ఎన్నికల కౌంటింగ్

Bhavani

జగన్ కేబినెట్ పైనల్ లిస్టు ఇదే

Satyam NEWS

ఫేక్ కరెన్సీ: హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన నకిలీ నోట్లు

Satyam NEWS

Leave a Comment