39.2 C
Hyderabad
April 28, 2024 11: 53 AM
Slider తెలంగాణ

ఫేక్ కరెన్సీ: హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన నకిలీ నోట్లు

నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్న రెండు ముఠాలకు చెందిన 13 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి 8.5లక్షలు నకిలీ కరెన్సీ, ఆరు మొబైల్స్ , ప్రింటర్స్, లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు ముద్రిస్తున్న వాటిలో 2 వేలు, 5 వందల నోట్లు ఉన్నాయని తెలిపారు. అదే విధంగా అబిడ్స్, జగదీష్ మార్కెట్ ప్రాంతాల్లో నకిలీ నోట్లు సరఫరా చేస్తున్న మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఈ 6 గురు సభ్యుల మరో ముఠాని అరెస్ట్ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. వీరి నుంచి 9.30 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా మరో ముగ్గురు సభ్యల అంతరాష్ట్ర ముఠా పాతబస్తీ లో పట్టుబడ్డారు. ఈ మూడు కేసుల్లో మొత్తం 17.77లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

Related posts

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

Satyam NEWS

జమ్మి చెట్టు విజయానికి ప్రతీక : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Satyam NEWS

అభివృద్ధి నిరోధకుడు సీఎం జగన్

Satyam NEWS

Leave a Comment