నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్న రెండు ముఠాలకు చెందిన 13 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి 8.5లక్షలు నకిలీ కరెన్సీ, ఆరు మొబైల్స్ , ప్రింటర్స్, లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు ముద్రిస్తున్న వాటిలో 2 వేలు, 5 వందల నోట్లు ఉన్నాయని తెలిపారు. అదే విధంగా అబిడ్స్, జగదీష్ మార్కెట్ ప్రాంతాల్లో నకిలీ నోట్లు సరఫరా చేస్తున్న మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఈ 6 గురు సభ్యుల మరో ముఠాని అరెస్ట్ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. వీరి నుంచి 9.30 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా మరో ముగ్గురు సభ్యల అంతరాష్ట్ర ముఠా పాతబస్తీ లో పట్టుబడ్డారు. ఈ మూడు కేసుల్లో మొత్తం 17.77లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
previous post