కొమురం భీం అసిఫాబాద్ జిల్లా దహేగం మండలం చంద్రపల్లి గ్రామంలో యువ మోర్చా వాలీబాల్ టోర్నమెంట్ లో భాగంగా నిర్వహిస్తున్న క్రీడోత్సవాలలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిర్పూర్ నియోజకవర్గ ఇంఛార్జి డా.కొత్తపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
హోరాహోరీగా సాగిన పోరులో కోటపల్లి s.ny జట్టు విజేతగా నిలిచింది రన్నరప్ గా చంద్రపల్లి జట్టు నిలిచింది. అనంతరం బహుమతుల ప్రదానోత్సవంలో డా.కొత్తపల్లి శ్రీనివాస్ పాల్గొని వాలీబాల్ విజేతలకు ట్రోఫీతో పాటు నగదు బహుమతిని అందించారు. కోటపల్లి s.ny జట్టుకు 20,000/-, రన్నరప్ చంద్రపల్లి జట్లకు 10,000/- బహుమతులు అందచేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సుహృద్భావ వాతావరణంలో క్రీడలు నిర్వహించుకుని సమాజంలో కలిసి మెలిసి ఉండాలని అన్నారు. యువత ఎలాంటి దురలవాట్లకు అలవాటు పడకుండా తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని యువత క్రీడా స్ఫూర్తిని అలవర్చుకొని ముందుకు సాగాలని కోరారు.
సమాజ నిర్మాణంలో యువకులు భాగస్వామ్యం కావాలన్నారు. అదే విధంగా గ్రామ స్థాయి క్రీడాకారులు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆడాలన్నారు.
ఈ కార్యక్రమంలో దహేగం మండల అధ్యక్షులు రాంటెంకి సురేష్, ఉపాధ్యక్షులు సింగం నాగేష్, సర్పంచ్ లగ్గం దామోదర్, బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మెడి కార్తిక్, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రశాంత్, కొమురం లచ్చన్న మండల కార్యదర్శి, హెల్త్ కమిటీ అధ్యక్షులు విజయ్ సూతర్, దుర్గం అశోక్, గోమాస్ తిరుపతి బూత్ అధ్యక్షులు, డబ్బుల దీలీప్ కుమార్, కొండపల్లి ప్రవీణ్, కొండగొర్ల వసంత్ రావు, తల్లా రాజలింగు, గొందే రాజేష్, దుర్గం రవి, దుర్గం కేదార్, ఓల జంపేష్ తదితరులు పాల్గొన్నారు.