NTV చైర్మన్ నరేంద్ర చౌదరి పై మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో ఎన్ ఫోర్సు మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ అయ్యాయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పరిధిలోని హకీంపేట్ గ్రామం, షేక్పేట్లోని సర్వే నంబర్ 403/1 (పాత నంబర్) సర్వే నంబర్ 120 (కొత్త)లోని 1,519 చదరపు గజాల స్థలం అలాట్మెంట్కు సంబంధించి ఎన్ఫోర్సెమెంట్ డైరెక్టరేట్కు ఫిర్యాదులు వెళ్ళాయి.
ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ లావాదేవీలు జరిగినపుడు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న ఎన్టీవీ న్యూస్ ఛానల్ ఛైర్మన్ టి నరేంద్ర చౌదరికి సంబంధిత ఇతరులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 7వ తేదీన ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా సమన్లలో పేర్కొన్నారు.
ఈ భూమికి సంబంధించిన లావాదేవీల పత్రాలను కూడా తీసుకురావాలని ఈడీ స్పష్టం చేసింది. సొసైటీకి చెందిన పదేళ్ళ ఆడిట్ ఫైనాన్షియల్ రిపోర్టులు, వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్టులు, సొసైటీ బోర్డ్ మినిట్స్ను కూడా తీసుకురావాలని నోటీసులో స్పష్టం చేశారు.