మానవాళికి పెను సవాలుగా పరిణమించి, ఎన్నో ఇక్కట్లకు, వ్యధలకు గురిచేసిన కోవిడ్-19 మహమ్మారి ఉనికి ఇంకా కొనసాగుతూ, ఒమిక్రాన్ వేరియెంట్ రూపంలో క్రొత్త ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపద్యంలో ప్రజాశ్రేయస్సు దృష్ట్యా 2022 జనవరి 1వ తేదీన నూతన సంవత్సర వేడుకలకు తాను దూరంగా ఉండనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19, ఒమిక్రాన్ వేరియెంట్ లు వచ్చే జనవరి నుండి మార్చి వరకూ గల కాలంలో ఉదృతమయ్యే అవకాశం ఉందని, వాటిని నిరోధించేందుకు సామాజికమైన అప్రమత్తత, జాగ్రత్తలు అవసరమని పలు జాతీయ, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు, నిపుణులు సూచిస్తున్న నేపద్యంలో ప్రజారోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం గైకొన్నట్లు ఆయన తెలిపారు. కావున నూతన సంవత్సరాది పురస్కరించి జనవరి 1వ తేదీన వ్యక్తిగతంగా తనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసేందుకు కలెక్టరేటుకు గానీ, క్యాంపు కార్యాలయానికి గానీ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు, ప్రజలు ఎవరూ తరలి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
previous post