లాక్ డౌన్ కారణంగా జన సంచారం లేకపోవడంతో తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లపై వన్యప్రాణులు కనిపించడం తరచూ జరుగుతున్నది. తాజాగా తిరుమల మొదటి ఘాట్రోడ్డులో ఏనుగుల గుంపు కనిపించడంతో కలకలం రేగింది. లాక్డౌన్తో నిర్మానుష్యంగా మారిన ఘాట్రోడ్లపై అడవి జంతువులు యధేచ్ఛగా తిరుగుతున్నాయి.
శుక్రవారం సాయంత్రం దాదాపు 5 ఏనుగులు ఏడో మైలు వద్ద రోడ్డుపై నిలబడ్డాయి. తిరుమలలో విధులు ముగించుకుని వెనుదిరిగిన కొందరు ఉద్యోగులు, కార్మికులు ఈ ఏనుగుల గుంపును చూసి దూరంగా నిలబడ్డారు. కొద్దిసేపటి తర్వాత అవి అడవిలోకి వెళ్లిపోయాయి.