33.7 C
Hyderabad
April 29, 2024 23: 20 PM
Slider ఆదిలాబాద్

ఎలర్ట్: అత్యవసర విభాగాలకు ప్రత్యేక పాస్ లు

nirmal police

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మరిన్ని చర్యలు చేపట్టడంలో భాగంగా నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో  జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని అత్యవసర శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అధికారులకు, సిబ్బందికి అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఎమర్జెన్సీ పాస్ ను అందిస్తున్నట్టు జిల్లా ఎస్పీ వెల్లడించారు.

ఈ మీటింగ్ లో జిల్లా అదనపు ఎస్పీలు, డీఎస్పీ నిర్మల్, డాక్టర్ వసంత్ రావు, జిల్లా వైద్యాధికారి, డాక్టర్ దేవేందర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఏరియా ఆసుపత్రి, నిర్మల్, డాక్టర్. కార్తీక్, కరోనా నోడల్ అధికారి, కరీం, AO, కలెక్టరేట్, నిర్మల్, మధుసూధన్, ఎలక్ట్రిసిటీ D.E. Nirmal, బాలకృష్ణ, మునిసిపల్ కమీషనర్, నిర్మల్, డాక్టర్. సుభాష్, IMA, Nirmal తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రతి పౌరుడు సేవా గుణాన్ని అలవర్చుకోవాలి

Satyam NEWS

వయోవృద్ధులకు ఉపయోగపడే న్యాయసహాయ పుస్తకావిష్కరణ

Satyam NEWS

ధర్డ్ వికెట్: యనమల రామకృష్ణుడిపై ఎస్ సి ఎట్రాసిటీ కేసు

Satyam NEWS

Leave a Comment