సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం సీతారాంపురం గ్రామంలో DMFT నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికి నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శంఖుస్థాపన చేశారు.
గ్రామంలో మంచినీటి సమస్య తీర్చేందుకు గ్రామానికి చెందిన తుమ్మల సుధాకర్ బాబు ఆర్ధిక సహాయంతో నిర్మించిన వాటర్ ప్లాంట్ ను ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రతి పౌరుడు సేవా గుణాన్ని కలిగి ఉండాలని, అప్పుడే మనతో పాటు నలుగురు ఆనందంగా ఉంటారని అన్నారు. నిర్మాణానికి ఆర్ధిక సహాయం చేసిన దాత తుమ్మల సుధాకర్ బాబు ను సైదిరెడ్డి సన్మానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుడెపు శ్రీను, జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, సర్పంచ్ అద్దంకి సైదేశ్వర్ రావు, ఎంపిటిసి విజయలక్ష్మి, PACS ఛైర్మన్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.