కరోనా రిలీఫ్ ఫండ్ కోసం ప్రముఖ యోగా గురువు బగాది పాపారావు రూ. 10,000 విరాళం ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు కలెక్టర్ జె. నివాస్ కు ఈ చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎటువంటి రోగాన్ని అయినా యోగా తో నయం చేయవచ్చునని అన్నారు.
ఇంత వరకూ బెంగుళూరు, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఎన్నో యోగా ప్రదర్శనలు ఇచ్చానని తెలిపారు. రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులకు కూడా యోగా నివారణ మార్గమని ఆయన అన్నారు. కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఇటువంటి సహాయం పేదవారికి ఉపయోగపడుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కు చెందిన బగాది పాపారావు రాజాం ఎక్సైజ్ కార్యాలయం లో పనిచేస్తూ శెలవు రోజుల్లో ఉచితంగా యోగా బోధిస్తారు. ప్రజలకు , విద్యార్థులకు , ప్రభుత్వ, ప్రైవేటు, ఉద్యోగస్తులకు ఉచితంగా సేవ చేస్తున్నారు. ఆయనతో పాటు ఏ ఏ ఎఫ్, ఆర్ టి ఏ విజియనగరం జిల్లా అధ్యక్షులు గుడివాడ మహేష్, ఆర్గానిక్ రైతు బుడుమూరు శ్యామలరావు, శ్రీరాజ్ తదితరులు ఉన్నారు.