తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి నేడు బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి దేవస్థానంలో ఆమెకు ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో ఏ ఈవో సుదర్శన్ గౌడ్, మండల తహసీల్దారు శివ ప్రసాద్, ఏస్సై ప్రేమ్ దీప్ తదితరులు కూడా పాల్గొన్నారు.