Slider కడప

అన్నమయ్య జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడుగా చమర్తి

#chamarti

టీడీపీ పార్టీని నమ్ముకొని విధేయతగా ఉన్నవారికి పార్టీలో సముచిత స్థానం లభిస్తునడంలో సందేహం లేదు. ఇందుకు నిదర్శనమే సుధీర్ఘ కాలం పాటు టీడీపీకి సేవలందించిన ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్ మోహన్ రాజును టీడీపీ అధిష్టానం అన్నమయ్య జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా నియమిస్తూ సోమవారం “ఉత్తర్వులు జారీ చేసింది. అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఈ మేరకు చమర్తిని సోమవారం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు.

జగన్ రాజు ఆది నుంచి పార్టీకోసం పనిచేస్తూ ఒడిదుడుకులు అధిగమించి నియోజకవర్గ స్థాయిలో విస్తృతస్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, క్యాడర్ కు అండగా నిలబడుతూ వచ్చారు. పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ అహర్నిశలు కృషి చేస్తూ మొక్కవోని దీక్షతో విధేయుడిగా పేరుగాంచిన చమర్తికి నేటికైనా అధిష్టానం గుర్తింపునిచ్చి గౌరవించినందుకు ఆయన అనుచరులు, వర్గీయలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిజాయితీపరుడు,నిబద్దత కలిగిన వివాద రహితుడైన జగన్ మోహన్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనపై విశ్వాసముంచి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, అచ్చన్నాయుడు మరియు తనకు అండగా నిలబడిన శ్రేయోభిలాషులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పదవి మరింత బాధ్యతను పెంచిందని, జిల్లాస్థాయిలో అన్ని వర్గాల వారిని కలుపుకుని పార్టీ బలోపేతం చేస్తూ 204 ఎన్నికలే లక్ష్యంగా కృషి చేస్తూ నారా చంద్రబాబు నాయుడు ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు శక్తి వంచన లేకుండా సైనికుడిలా పోరాడి కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు.

Related posts

మెగా ఇంజనీరింగ్ కంపెనీపై ఐటి దాడులు

Satyam NEWS

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలి

Satyam NEWS

అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ ప్రతిభ చాటిన అభిగ్యాన్

Satyam NEWS

Leave a Comment